రూ.15 వేలలోపే జియో కొత్త బుక్ ల్యాప్టాప్.. 💻
- Suresh D
- Mar 11, 2024
- 1 min read
Jio Book Laptop తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొత్త జియో బుక్ ల్యాప్టాప్ వచ్చేసింది.
Jio Book Laptop తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో కొత్త జియో బుక్ ల్యాప్టాప్ వచ్చేసింది. ఇందులో 100GB క్లౌడ్ స్టోరేజీతో పాటు ఎన్నో అద్భుతమైన ఫీచర్లున్నాయి. హై ఎండ్ ల్యాప్టాప్లలో జియో బుక్లో ఏయే ప్రత్యేకతలున్నాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో కంపెనీ ప్రకటించినట్టు.. మన దేశంలో ఇదే మొదటి లెర్నింగ్ ల్యాప్టాప్. విద్యార్థులకు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయం, ఈ మెయిల్స్ పంపడంతో పాటు మల్టీపుల్ ప్రయోజనాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ జియోబుక్ ల్యాప్టాప్లో కోడింగ్ కూడా నేర్చుకోవచ్చని ఆ కంపెనీ ప్రకటించింది. దీనికి వైఫైకి కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇందులో జియో 4G కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. 4G కనెక్టివిటీ కావాలనుకునేవారు ఈ ల్యాప్టాప్ కొనొచ్చు. దీని ధర రూ.14,071 రూపాయలు. దీన్ని రిలయన్స్ డిజిటల్ షోరూమ్స్ లేదా ఆన్లైన్లో, అమెజాన్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ 4G LTE కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్కు సంబంధించి ఏవైనా సమస్యలొస్తే కస్టమర్ సర్వీసు సెంటర్లు, కస్టమర్ కేర్ కాల్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.