కోడి గుడ్డు కోసం లక్షలు.. ఎగబడ్డ జనం..?
- MediaFx

- Apr 16, 2024
- 1 min read
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మసీదు నిర్మాణానికి విరాళంగా అందజేసిన గుడ్డు కొన్ని లక్షలకు వేలంలో అమ్ముడు పోయింది.
ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్లోని మల్పోరా గ్రామంలో ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్కు 55 కిలోమీటర్ల దూరంలోని సోపోర్ పరిధిలోని మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ఒక గుడ్డును విరాళంగా ఇచ్చారు. ఈ గుడ్డు వేలంలో రూ.2 లక్షలకు పైగా పలికింది. ఇక్కడ మసీదు నిర్మాణానికి నిధులు సేకరించేందుకు విరాళంగా ఇచ్చిన గుడ్డు వేలంలో రూ.2.26 లక్షలు సమకూరింది. ఈ సమాచారాన్ని సదరు కమిటీ తెలిపింది.
విషయం ఏంటంటే.. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మించే పనులు చేపట్టారు. అటువంటి పరిస్థితిలో, స్థానిక మసీదు కమిటీ నిర్మాణ పనుల కోసం నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించడం ప్రారంభించింది. ఇంతలో, ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేస్తున్నట్టుగా చెప్పింది. దాంతో వృద్ధురాలు ఇచ్చిన ఈ గుడ్డును కూడా వేలంలో వస్తువుగా పెట్టారు. వేలం సమయంలో ఈ గుడ్డు ఎంతో మందిని ఆకర్షించింది. కేవలం ఐదు నుంచి ఏడు రూపాయల ధర ఉన్న ఈ గుడ్డు వేలంలో ఎక్కువ డిమాండ్ పలికింది. ఏకంగా మూడు రోజుల పాటు ఈ గుడ్డుపై వేలం కొనసాగింది. చివరకు వేలం చివరి రోజు డానిష్ అహ్మద్ అనే యువ వ్యాపారి కోడిగుడ్డును రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఈ గుడ్డు వేలంలో చాలాసార్లు కొనుగోలు చేయబడింది. చివరకు మొత్తం ధర రూ.2 లక్షల 26 వేల 350గా చేరిందని కమిటీ వెల్లడించింది.ఈ ఘటన సోపోర్లోని మాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక్కడ మసీదు నిర్మాణం కోసం కమిటీ ద్వారా నగదు, వస్తు రూపంలో విరాళాలు సేకరించబడ్డాయి. ఇందులో కలప, ఇటుకలు, సిమెంటు, టిన్ షీట్లు తదితర వస్తువులను ప్రజలు విరాళంగా అందజేశారు. ఈ సమయంలో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేసింది. ఏది ఏమైనా గుడ్డును చివరిసారి వేలం వేసి ఓ యువకుడు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.












































