'అన్ స్టాపబుల్' సర్ప్రైజ్ ఎపిసోడ్ - సీజన్ 3లో రణ్ బీర్ఎ ప్పుడంటే?🎥 💫
- Suresh D
- Nov 10, 2023
- 1 min read
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' సీజన్ 3 కి త్వరలోనే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 'యానిమల్' మూవీ టీం తో కలిసి సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.🎥 💫

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో ఓ సర్ప్రైజ్ ఎపిసోడ్ ఉండబోతోందట. ఇటీవలే మొదలైన సీజన్ 3 లో ఓ బాలీవుడ్ హీరో తన మూవీ టీంతో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు? ఆ సర్ప్రైజ్ ఎపిసోడ్ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే.. ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా 'అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే రెండు సీజన్స్ ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. సెలబ్రెటీలతో బాలయ్య చేసే సందడికి ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు సైతం బాలయ్య షోకి రావడంతో అన్ స్టాపబుల్ షో కి భారీ క్రేజ్ వచ్చింది. ఇటీవల సీజన్ 3 మొదలైన విషయం తెలిసిందే.
సీజన్ 3 లో భాగంగా ఇప్పటికే బాలయ్య తన 'భగవంత్ కేసరి' మూవీ టీంతో సందడి చేశాడు. ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో స్పెషల్ గా మొదలైన సీజన్ 3 కి గెస్ట్ గా రణబీర్ కపూర్ రాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అతనితో పాటు నేషనల్ రష్మిక మందున్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా హాజరు కాబోతున్నారట. సందీప్ రెడ్డి తో రణబీర్ కపూర్ 'యానిమల్'(Animal) అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ లుగా రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే రణబీర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొదలుకానుందని చెబుతున్నారు. అంతేకాదు నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ ఎపిసోడ్ 'ఆహా'లో ప్రసారం కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది. 🎥 💫