కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు మరో ప్రపంచ యుద్ధం తప్పదా..?🚀💥
- Suresh D
- Apr 13, 2024
- 1 min read
Updated: Apr 14, 2024
ఏ క్షణంలోనైనా ఇజ్రాయేల్పై ఇరాన్ దాడి చేయనుందన్న సంకేతాలతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వచ్చే 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో విరుచుకుపడేందుకు ఇరాన్ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు, తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ ప్రకటించింది. ఆ దేశానికి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వారికి రక్షణగా యుద్ధ నౌకలను పంపింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
ఇరాన్, ఇజ్రాయెల్లోని తమ పౌరులకు అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా తక్షణమే ఇరాన్ను వీడాలని ఫ్రాన్స్ తన దౌత్య సిబ్బందిని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయులు ఇజ్రాయేల్, ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహ్రాన్కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్ుట ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్.. తాజా పరిణామాల నేపథ్యంలో మరో ఐదు రోజుల వరకూ పొడిగించింది.
రెండు వారాల కిందట సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై జరిగిన దాడిలో రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇజ్రాయేల్పై ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించింది. అంతేకాదు, ఇజ్రాయేల్పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావొద్దంటూ అమెరికాకు కూాడా ఇరాన్ లేఖ రాయడం గమనార్హం. ఇరాన్ లేఖ కూడా అయితే, దాడిపై ఇంకా ఇరాన్ తుది నిర్ణయం తీసుకోలేదన్న కథనాలూ వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ దాడిని ఎదుర్కొవడానికి ఇజ్రాయేల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను ఇజ్రాయేల్కు సమీపంగా అమెరికా పంపింది. ఇదే సమయంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయేల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు.
గలాంట్ మాట్లాడుతూ ‘ఇజ్రాయేల్, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు. .కానీ జరిగేది అందుకు వ్యతిరేకం.. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు.. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. జో బైడెన్ సైతం ఇజ్రాయేల్పై దాడిలో ఇరాన్ సఫలం కాలేదని, తాము అండగా నిలుస్తామని తెలిపారు. ఇక, నేరుగా ఇరాన్ లేదా లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.🚀💥