రిఫ్రిజిరేటర్ పేలి కుటుంబమంతా సజీవ దహనం..ఆరుగురు మృతి
- Suresh D
- Oct 10, 2023
- 1 min read
రిఫ్రిజిరేటర్ పేలి ఆ కుటుంబంలో అంతులోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు మృత్యువాతపడినట్లు సమాచారం.

రిఫ్రిజిరేటర్ పేలి ఆ కుటుంబంలో అంతులోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు మృత్యువాతపడినట్లు సమాచారం. ఈ ఊహించని ప్రమాదం పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఆదివారం (అక్టోబర్ 8) రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పంజాబ్లోని జలంధర్ జిల్లాకు చెందిన ఓ ఇంట్లో అందరూ టీవీ చూస్తున్న సమయంలో ఆదివారం రాత్రి పెద్ద శబ్ధంతో రిఫ్రిజిరేటర్ పేలిపోయింది. అనంతరం ఇళ్లంతా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంటిళ్లిపాది ఇంట్లోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. మృతులను యశ్పాల్ గాయ్ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్ (40), మనవళ్లు మానస (14), దియా (12), అక్షయ్ (10)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. పేలుడుకు గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిళ్లను సేకరించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
ఒకే కుంటుంబానికి చెందిన అందరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసధికారులు తెలిపారు.