టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం..🎞️🎥
- Suresh D
- Oct 10, 2023
- 1 min read
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. దిల్రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
కాగా టాలీవేడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ మువీస్ నిర్మించారు. నిర్మాత దిల్ రాజు పూర్తి పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే కుటుంబం అంతా రాజు అని పిలవడంతో రాజు అనే పేరు స్థిరపడిపోయింది. నితిన్ హీరోగా నటించిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు పలు వ్యాపారాలు చేసిన ఆయన సినీ డిస్ట్రిబ్యూటర్గా తొలినాళ్లలో పనిచేశారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్రాజు తెలుగు సినీ పరిశ్రమలో మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. దిల్ రాజు మొదటి భార్య అనితతో హన్షిత అనే కుమార్తె వీరికి జన్మించింది. అనిత ఆరోగ్యంతో 2020లో మరణించడంతో.. దిల్ రాజు తేజస్విని అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నారు.🎞️🎥