top of page

అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం..



దేశవ్యాప్తంగా రామనవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈసారి రామనవమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత రాంలాలాకు ఇది మొదటి రామనవమి. ఈ సందర్భంగా రాంలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకంగా ఆ సూర్యభగవానుడే.. రాంలాలాకు అభిషేకం చేశాడు..ఆ పూర్వ ఘట్టాన్ని యావత్‌ దేశం కన్నులారా తిలకించి పులకించిపోయింది. ఆలయ నిర్మాణంలో భాగంగా అద్బుతమైన టెక్నాలజీ సాయంతో రూపొందించిన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. సూర్య తిలకం రామ్‌లల్లా నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్‌ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రాంలాలా నుదుటిపై పడటంతో ఆయనకు సూర్యాభిషేకం జరిగింది. 🌞


 
 
bottom of page