గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. టోర్నీ మొత్తానికి వరల్డ్కప్ హీరో దూరం.!🏏🙂
- Suresh D
- Feb 23, 2024
- 1 min read
ఐపీఎల్ 2024 సీజన్కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇది గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారింది.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ కోసం పది జట్లు సిద్ధమవుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 టోర్నీ మొదలవుతుంది . ఈ తరుణంలో గతేడాది రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2024 టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. ప్రధాన బౌలర్ షమీ లేకపోవడం గుజరాత్ టీమ్కు ఈ సీజన్లో చాలా ఇబ్బందిగా మారనుంది.
చీలమండ గాయం అవడం, శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉండటంతో ఐపీఎల్ 2024 సీజన్కు షమీ దూరం కానున్నాడని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. బ్రిటన్లో షమీకి సర్జరీ జరగాల్సిన అవసరం ఉందని, ఈ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అతడు ఆడలేడని వెల్లడించినట్టు పేర్కొంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇది షాక్గా మారింది.
2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో 2022లో టైటిల్ గెలిచిన ఆ జట్టు.. గతేడాది సీజన్లో ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్గా నిలిచింది. ఈ రెండు సీజన్లలోనూ గుజరాత్ గెలుపుల్లో పేసర్ మహమ్మద్ షమీ కీలకపాత్ర పోషించాడు. 2022 సీజన్లో షమీ 20 వికెట్లను పడగొట్టగా.. 2023 సీజన్లో 28 వికెట్లను దక్కించుకొని మరింత సత్తాచాటాడు. 🏏