భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ను అడ్డుకుంటాం.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపులు 🏏
- Suresh D
- Feb 22, 2024
- 1 min read
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ శుక్రవారం ( ఫిబ్రవరి 23) నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీకి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ శుక్రవారం ( ఫిబ్రవరి 23) నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీకి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. అయితే ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులకు పాల్పడ్డాడు . నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నాలుగో టెస్ట్ మ్యాచ్ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ యూట్యూబ్లో వీడియోను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూన్ బెదిరింపుల నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు అప్రమత్తమై మ్యాచ్ జరిగే జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వద్ద భద్రతను పెంచారు. అలాగే మ్యాచ్కు ఆటంకం కలిగించేలా ప్రేరేపించిన గురుపత్వంత్ సింగ్పై దుర్వా పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు డీఎస్పీ పీకే మిశ్రా తెలిపారు. వాస్తవానికి, ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ ఇలా బెదిరింపులు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు పన్నూ భారత్ను పలుమార్లు బెదిరించాడు. గతంలో వరల్డ్ కప్ ఫైనల్కు ముప్పు తిప్పలు పెట్టిన పన్ను.. ఎయిర్ ఇండియా విమానాలు, అమెరికా, కెనడాలోని భారతీయులను టార్గెట్ చేశాడు . 🏏