రతన్ టాటాకు తొలి ఉద్యోగరత్న అవార్డు..
- Suresh D
- Aug 20, 2023
- 1 min read
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటాను ఉద్యోగ రత్న పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు శనివారం ఆయన ఇంటికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్.. రతన్ టాటాకు అవార్డును అందజేశారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో విశేష సేవలు అందించిన పారిశ్రామిక వేత్తలను గౌరవించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉద్యోగ రత్న అనే అవార్డును అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలి ఉద్యోగ రత్న అవార్డును.. 85 ఏళ్ల రతన్ టాటాకు అందించింది.




Comments