📑📊అప్పులు కాదు ఆస్తులు పెంచాం - 51 పేజీలతో BRS డాక్యుమెంట్ విడుదల🏢✨
- Suresh D
- Dec 20, 2023
- 2 min read
రాష్ట్ర ఆస్తుల వివరాలతో బీఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. గత పదేళ్ల హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పేర్కొంది. మొత్తం 51 పేజీలతో ఈ డాక్యుమెంట్ ఉంది.
తెలంగాణ ఆర్థికస్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కాంగ్రెస్. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నోట్ ను ప్రకటించారు. దాదాపు 40 పేజీలతో దీన్ని రూపొందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని ఆర్థికపరిస్థితితో పాటు… గత పదేళ్లలో అప్పులు, ఆస్తుల వివరాలను ఇందులో పేర్కొన్నారు. అయితే సభ ప్రారంభం కాకముందే… బీఆర్ఎస్ పార్టీ ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అప్పులు కాదు ఆస్తులు పెంచామని చెప్పుకొచ్చింది. పదేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెంచామని తెలిపింది. 51 పేజీలతో కూడిన ఆస్తుల వివరాలను విడుదల చేసింది. 📑📊
బీఆర్ఎస్ డాక్యూమెంటరీలోని పలు వివరాలు:
-33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవనాల నిర్మాణాలు చేపట్టాం.
-ఇప్పటికే 25 కలెక్టర్ భవనాలు ప్రారంభమయ్యాయి.
-2014 తర్వత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ ల ఏర్పాటు.
-రాష్ట్రంలో ప్రస్తుతం 32 వేల 717 కిలోమీటర్ల రోడ్లు.
-8578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం.
-కొత్తగా 4713 చెత్త తరలించే వాహనాలు.
1022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాలు.
-7289.54 కోట్లతో మన ఊరు బడి తో 1240 బడుల నిర్మాణం, 1521 స్కూళ్ళలో సౌర విద్యుత్.
-కేజి టూ పీజీ గంబిరావు పేట లో తొలి క్యాంపస్.
-334 చిన్న పరిశ్రమల పురుద్దరణ.
-81.81 చ.కి.మి పెరిగిన పచ్చదనం, హరితహరం.
-Hmda పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లాకులు.
-19472 పల్లె ప్రకృతి వనాలు, 13657ఎకరాల విస్తీర్ణం.
-109 అర్బన్ ఫారెస్ట్ 75 740 ఎకరాల విస్తీర్ణం.
-1,00,691 కిమి రహదారి వనాలు.
-10,886 కిమీ కందకల తవ్వకం
-19వేళ పల్లెల్లో పార్కులు
-2700 ట్రీ పార్కులు
-1200 కోట్ల తో యాదాద్రి పునర్నిర్మాణం
-2800 కోట్ల ఆలయాల అభివృద్ధి
-100 కోట్లతో దేవాదాయ శాఖ కు నిధులు
-75 కోట్లు దూప దీప నైవేద్యం కింద అర్చకుల వేతనం
-212 కోట్ల తో బ్రహ్మణ సంక్షేమం కోసం
-ఆరోగ్య శాఖ లో 34000 హాస్పిటల్ బెడ్స్, 34000 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐసీయూ కేంద్రాలు, 56 బ్లడ్ బ్యాంక్ లు, 82 డయాలసిస్ కేంద్రాలు, 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు.
-1000 పడకల అల్వాల్ టీమ్స్, ఎరగడ్డ టీమ్స్, గడ్డి అన్నారం టీమ్స్, 1261 బెడ్ల తో గచ్చి బౌలి టీమ్స్
-1571 కోట్ల తో నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి విస్తరణ.
-3779 కోట్ల తో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
-33 మెడికల్ కాలేజీలు నిర్మాణం, 8515 మంది ఎంబీబీఎస్ సీట్లు.
-585 కోట్ల తో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్.
-137 పోలీసు భవనాల నిర్మాణం, 654.50 కోట్లతో జిల్లా ఎస్పీ కార్యాలయాలు
-10.13 లక్షల సీసీ కెమెరాలు.
-20,115 పోలీసు వాహనాలు.
-9 కమిషనరేట్ల ఏర్పాటు, 719 సర్కిల్స్, 164 పోలీస్ సబ్ డివిజన్ లు, 815 పోలీస్ స్టేషన్ పెంపు.
-కాళేశ్వరం ప్రోజెక్ట్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం (35 వేల కోట్లు) ప్రారంభం.
-విద్యుత్ రంగం 2014లో 7748 మెగావాట్ల నుంచి2023 లో 19, 464 మెగావాట్ల కు పెంపు.
-15497 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం.
-వ్యవసాయానికి , గృహ వినియోగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం.
-57.82 శాతం తలసరి విద్యుత్ వినియోగం లో వృద్ది.
-లోడ్ మెయింటేన్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ బిగింపు.
-2014 లో విద్యుత్ సంస్థల అప్పు 22,423 కోట్లు, 2023 లో 81 వేల కోట్లు.
-2014 లో 44,431 కోట్ల విద్యుత్ ఆస్తులు.
-2023 లో 1,37, 571 కోట్ల పెరిగిన విద్యుత్ ఆస్తులు.
-59 వేల కోట్ల అప్పులు, 93 వేల కోట్ల ఆస్తుల పెరుగుదల.
-5000 కోట్లతో గొర్రెల పంపిణీ.
-72,817 కోట్ల రైతు బంధు నిధుల విడుదల.
-5402 కోట్ల రైతు బీమా.
-572 కోట్ల తో రైతు వేదికల ఏర్పాటు.
-1,98, 37 వేల ఎకరాల మేర పెరిగిన పంట విస్తీర్ణం.
-8735.32 కోట్ల తో మిషన్ కాకతీయ, 21, 633 చెరువుల పునరుద్దరణ.
-617 కోట్ల తో కొత్త సచివాలయం నిర్మాణం.
-146.50కోట్ల తో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం.
-178 కోట్లతో 3ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి.
-2014 లో 27, 200 కోట్ల సేల్స్ టాక్స్ 2023 లో 72564 కోట్ల వసూళ్లు.
-2014 లో 2832 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14, 291 కోట్ల వసూలు.
-2014 లో 1,24,104 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023 లో 3.12,398 కోట్ల పెరిగిన తలసరి ఆదాయం.
-159.6 పెరిగిన తలసరి ఆధాయం.
ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు అప్పులు చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని కొంతమంది చూస్తున్నారని బీఆర్ఎస్ తన డాక్యుమెంట్ లో తెలిపింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.