top of page

మధ్యాహ్నం లేటుగా తింటే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..

సమయానికి తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో లేట్ గా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ree

మధ్యాహ్నం ఆలస్యంగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. కొంతమందికి భోజనం చేసిన వెంటనే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. కానీ చాలా మందికి మాత్రం తిన్నా కూడా గ్యాస్ సమస్య మరింత ఎక్కువవుతుంది. లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే మధ్యాహ్నం లేట్ గా తినకూడదంటారు నిపుణులు.

మధ్యాహ్న భోజనం ఆలస్యమైతే రకరకాల అసౌకర్యాలకు గురవుతారు. అలసట, నిద్రమబ్బు, శక్తి లేకపోవడం, యాంగ్జైటీ, కోపం, అసహనం వంటి అనేక ఎన్నో సమస్యలు మధ్యాహ్నం భోజనం సమయానికి చేయకపోవడం వల్లే వస్తాయంటున్నారు నిపుణులు. ఆలస్యంగా తిన్న తర్వాత నిద్రమత్తులోకి జారుకుని ఆ తర్వాత ఏం చేయాలనిపించదు. అయితే ఆలస్యమైనా భోజనం చేసే వరకు అప్పుడప్పుడు నీళ్లనైనా తాగుతూ ఉండాలి. చల్లటి నీరు లేదా తీపి పానీయాలు అసలు తాగకూడదు. ఈ సమయంలో సాదా నీటిని మాత్రమే తాగాలి.

 
 
bottom of page