📱😔 ఐఫోన్ కోసం 8నెలల పసికందును అమ్మేశారు.. 😢
- Suresh D
- Jul 29, 2023
- 1 min read
ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కష్టంగా అనిపించినా ఇది నిజం. రీసెంట్ గా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం ట్రెండ్ అవుతోంది. ఈ జంట కూడా ఇలాగే చేసి డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ దంపతులు తమ ఎనిమిది నెలల కొడుకును ఐఫోన్ 14 కొనేందుకు అమ్మేశారు.

ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కష్టంగా అనిపించినా ఇది నిజం. రీసెంట్ గా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం ట్రెండ్ అవుతోంది. ఈ జంట కూడా ఇలాగే చేసి డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ దంపతులు తమ ఎనిమిది నెలల కొడుకును ఐఫోన్ 14 కొనేందుకు అమ్మేశారు. పసిపాపను విక్రయించిన వ్యక్తి నుండి ఐఫోన్ను కొనుగోలు చేయడం ద్వారా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను తయారు చేయాలనుకున్నాడు.📸💲 రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ రీళ్లు తయారు చేసి డబ్బు సంపాదించవచ్చని భావించారు.పశ్చిమ బెంగాల్లోని ఉత్తర పరగణాస్ జిల్లాలో నివసిస్తున్న జయదేవ్, సతీ ఘోష్ అనే దంపతులపై అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సతీఘోష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే జయదేవ్ ఘోష్ పరారీలో ఉన్నాడు మరియు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అనుమానం వచ్చిన భార్యాభర్తల ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా కనిపించకుండా పోయిన తమ 8 నెలల పాప గురించి దంపతులకు ఎలాంటి ఆందోళన లేకపోవటం ఇరుగుపొరుగు వారు గమనించారు. అంతే కాకుండా దంపతుల చేతిలో దాదాపు రూ.70వేలు ఉన్నాయి. అందుబాటు ధరలో ఐఫోన్ ఉండటం అందరిలో సందేహం వచ్చేలా చేసింది.అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు స్థానిక కౌన్సిలర్ కు సమాచారం అందించగా ఆయన పోలీసులను విచారణకు ఆదేశించారు. విచారణలో తల్లి తన బిడ్డను ఐఫోన్ కోసం అమ్మినట్లు అంగీకరించింది. గతంలో తన 7 ఏళ్ల కూతురిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. దంపతులపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. 8 నెలల పాపను కొనుగోలు చేసిన మహిళపై కూడా మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది.🚨🔍🚓