top of page

📢 సాగదీత ధోరణి వద్దు.. వెంటనే తేల్చండి.. కాంగ్రెస్‌‌కు కామ్రేడ్స్‌ డిమాండ్.. 💬

🇮🇳 ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఎర్ర జెండా పార్టీల నేతలతో మధ్యవర్తిత్వం మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీని ఓడించాలన్నలక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాయి కమ్యూనిస్టు పార్టీలు. అయితే మాకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తే జత కడతామని సీపీఐ నేతలు అన్నట్లు సమాచారం. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి ఫైనల్ చర్చలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 🌐

🔴 టీపీసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఠాక్రేతో సీపీఐ నేతలు కూనంనేని, చాడ, పల్లా వెంకట్‌రెడ్డి భేటీ ముగిసింది. ఓట్లు చీలకుండా అందరిని కలుపుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్.. వామపక్షాలతో కలిసి వెళ్లేందుకు సుముఖంగానే ఉంది. బీఆర్ఎస్‌తో స్నేహానికి బ్రేక్‌ పడడంతో కమ్యూనిస్టు పార్టీల నేతలు భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా.. త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 🤝🌱

 
 
bottom of page