top of page

బాబా రామ్‌దేవ్‌ఫై ఆగ్రహించిన సుప్రీంకోర్టు..!

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీం కోర్టు ఆంక్షలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది.

ree

డ్రగ్స్ ప్రకటనలలో తప్పుదారి పట్టించే వాదనలు చేయబోమని వాగ్దానం చేసినందుకు రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృ ష్ణకు సుప్రీంకోర్టు మంగళవారం ధిక్కార నోటీసులు పంపింది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల షేర్లలో కనిపిస్తోంది. కేవలం 105 నిమిషాల్లోనే రామ్‌దేవ్ కంపెనీకి దాదాపు రూ.2300 కోట్ల నష్టం వాటిల్లింది. మంగళవారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఆ తర్వాత కంపెనీ షేర్ల గణాం కాలు మార్కె ట్‌లో ఎలా కనిపిస్తున్నా యో చూద్దాం . 

గుండె జబ్బులు, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తాయంటూ పతంజలి ఉత్పత్తులను ప్రచారం చేయకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) కోర్టులో పతంజలి ప్రకటనతో సహా, ది హిందూ వార్తాపత్రికలో చేసిన ప్రకటన, యోగా సహాయం తో మధుమేహం , ఆస్తమాను పూర్తిగా నయం చేస్తుందని కంపెనీ విలేకర్ల సమావేశం లో పేర్కొన్న సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేయకుండా.. తప్పుదారి పట్టించే దావాలు చేయకుండా పతంజలిని నిలువరించిన మునుపటి కోర్టు ఉత్తర్వులను సదరు కంపెనీ ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది. 

కోర్టు తీర్పు తర్వాత బుధవారం కంపెనీ షేర్లలో భారీ పతనం చోటు చేసుకుంది. బిఎస్‌ఇలో పతంజలి ఫుడ్స్ షేర్లలో సుమారు 4 శాతం క్షీణత కనిపిస్తోంది. కంపెనీ షేరు రూ.1556కి వచ్చింది. కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.1620.20 వద్ద ముగిశాయి.  కంపెనీ షేర్లు పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్ గణనీయంగా తగ్గింది. 105 నిమిషాల  ట్రేడింగ్ సెషన్‌లో రామ్‌దేవ్ కంపెనీ దాదాపు రూ.2300 కోట్లు నష్టపోయింది.  

 
 
bottom of page