రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్..
- Shiva YT
- May 24, 2023
- 1 min read
రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. స్టూవర్టుపురం గజదొంగని.. జాన్ అబ్రహం, దుల్కర్ సల్మాన్, కార్తీ, శివ రాజ్ కుమార్, వెంకటేష్ పాన్ ఇండియాకి పరిచయం చేశారు.

Tiger Nageswara Rao First Look Teaser :
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఒక్కప్పుడు స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఇప్పటివరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కొత్త దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాశ్మీర్ ఫైల్స్, కార్త్తికేయ 2 వంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమా నిర్మిస్తుండడంతో నార్త్ సైడ్ కూడా టైగర్ నాగేశ్వరరావు పై ఆసక్తి చూపిస్తున్నారు.