అందరినీ మెప్పించేలా జక్కన్న ‘మహా భారతం’ సాధ్యమేనా? 🤔🌟
- Suresh D
- Jul 11, 2023
- 1 min read
బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్కి వెళ్లిపోయింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లు సైతం రాజమౌళి టేకింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు.

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్కి వెళ్లిపోయింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లు సైతం రాజమౌళి టేకింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దాసోహమైంది. ఇందులోని నాటునాటు పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చింది. ఇప్పుడిదే సక్సెస్ జోష్ను కొనసాగిస్తూ త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయనున్నారీ క్రియేటివ్ డైరెక్టర్. ఎస్ఎస్ఎమ్బీ 29 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ కూడా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. మహేశ్ బాబు సినిమా తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి? అన్న ప్రశ్నకు తెర దించారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రాజమౌళి తీయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా మహా భారతం సినిమా ట్రెండింగ్లోకి వచ్చింది.కాగా గతంలోనూ మహాభారతం సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ‘భారతీయ ఇతిహాసాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలి. మహా భారతం నా చిరకాల ప్రాజె్ట్. అయితే అదొక మహాసముద్రమని తెలుసు. అందులో అడుగుపెట్టడానికి చాలా సమయం పడుతుంది. మహా భారతం తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోననుకుంటున్నా. . అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. మహేశ్ సినిమా తర్వాత అంటే 2025లో ఈ గ్రాండియర్ మూవీ పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం సినిమా ప్రియులు కూడా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. 😍🎬