top of page

ఆ మూడు పదాలు పలకడానికి రూ.5 కోట్లు తీసుకున్న మహేష్ బాబు..! 🎉

Updated: Mar 4, 2024



మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న రేంజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే వచ్చిన గుంటూరు కారం మూవీకి నెగటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించిందంటే దానికి కారణం అతనికి ఉన్న స్టార్‌డమ్. అయితే ఆ స్టార్ స్టేటస్ తోనే ఇప్పుడు మహేష్ ఓ యాడ్ కోసం మూడే మూడు పదాలు పలకడానికి ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సిల్వర్ స్క్రీన్ పైనే కాదు యాడ్స్ లోనూ మహేష్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఈ సూపర్ స్టార్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికి బ్రాండ్స్ పోటీ పడుతుంటాయి. తాజాగా యూపీఐ యాప్ ఫోన్ పే కూడా అదే ప్రయత్నం చేసింది. ఈ బ్రాండ్ కోసం థ్యాంక్ యూ బాస్ అనే మూడు పదాలు పలకడానికి మహేష్ బాబు ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు ట్రాక్ టాలీవుడ్ రిపోర్టు వెల్లడించింది.ఫోన్ పేలో ట్రాన్జాక్షన్ చేసిన ప్రతిసారీ చివర్లో థ్యాంక్యూ బాస్ అనే మహేష్ బాబు వాయిస్ ను యూజర్లు వింటారు. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్స్ వాడే వాళ్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. నిజానికి ఇదో మంచి ఐడియానే. ఫోన్ పే తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడానికి మహేష్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్ ను ఎంచుకోవడం కూడా బాగుంది. అయితే దీనికోసం ఈ సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషనే ఆశ్చర్యం కలిగిస్తోంది. 🌟

 
 
bottom of page