top of page

బీజేపీ-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని తేలిపోయింది -విజయశాంతి 🤔🔍

బీజేపీ-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని ఆరోపించారు కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోర్డినేటర్‌ విజయశాంతి.

బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం కారణంగానే బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారని ఆరోపించారు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోదీ వంటి నేతలు కేసీఆర్‌ను అవినీతిపరుడని పేర్కొన్నా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు, ఉద్యమకారుల్ని బీజేపీ పిచ్చోళ్లను చేసిందన్నారు. బీజేపీది తెర ముందు ఒకమాట మాట్లాడుతూ.. తెరవెనుక బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు రాములమ్మ. 🔄🔎


 
 
bottom of page