ఎట్టకేలకు మొదలైన ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా..
- Suresh D
- Jan 18, 2024
- 1 min read
ఎట్టకేలకు ధనుష్ , శేఖర్ కమ్ముల సినిమా మొదలైంది. నేడు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, హీరో ధనుష్, నిర్మాతలు పుస్కర్ రామ్ మోహన్ రావు, భారత్ నారంగ్ అలాగే సునైల్ నారంగ్ పాల్గొన్నారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తమిళ్ హిందీ భాషలతో పాటు ఇటీవలే తెలుగులోనూ సినిమా చేశారు ధనుష్. వెంకీ కుడుములు దర్శకత్వంలో ధనుష్ సార్ అనే సినిమా చేశారు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. చదువు గొప్పతనం చెప్పే కథతో ఆకట్టుకున్నారు ధనుష్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లోనూ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ తెలుగు సక్సెస్ ఫుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు.
కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అప్పట్లో టాక్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమా పిరియాడికల్ డ్రామా అని కూడా గుసగుసలు వినిపించాయి. సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. ఈ సినిమా అసలు మొదలవుతుందా.? లేక ఆపేశారా.? అన్న సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఎట్టకేలకు ధనుష్ , శేఖర్ కమ్ముల సినిమా మొదలైంది. నేడు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, హీరో ధనుష్, నిర్మాతలు పుస్కర్ రామ్ మోహన్ రావు, భారత్ నారంగ్ అలాగే సునైల్ నారంగ్ పాల్గొన్నారు. ధనుష్ కెరీర్ లో ఈ సినిమా 51వ మూవీ. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది’. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు.ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఎలాంటి కథతో వస్తాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమా గురించిన మరిన్ని డీటైల్స్ తెలుపనున్నారు.