బ్లాక్బస్టర్ డైరెక్టర్ వదిలిన ‘యేవమ్’ టీజర్
- MediaFx

- May 25, 2024
- 1 min read
‘యేవమ్’ సినిమా ఓపెనింగ్కు వచ్చిన నేను.. మళ్లీ ఆ చిత్ర టీజర్ను విడుదల చేయడం చాలా హ్యపీగా వుందని అన్నారు బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ . ‘యేవమ్’ చాలా మంచి టైటిల్. చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే చిత్రం కూడా కొత్తగా వుంటుందని అనిపిస్తుందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. చాందిని చైదరి , వశిష్ట సింహా , భరత్రాజ్ , అషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘యేవమ్’. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. తాజాగా బ్లాక్బస్టర్ మాస్ డైరెక్టర్ హరీష్శంకర్ చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర టీజర్ని విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం.. టీజర్ చాలా ఇంప్రెసివ్గా వుంది. టీమ్కు ఆల్ ది బెస్ట్.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ.. కంటెంట్ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం. మా టీజర్ను బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా, భరత్రాజ్ పాత్రలకు సంబంధించిన లుక్స్ను విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. కొత్త కంటెంట్తో పాటు డిఫరెంట్ నేరేషన్తో రాబోతోన్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకముందని అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కీర్తన శేషు, నీలేష్ మందలపు సంగీతం అందిస్తున్నారు.











































