top of page

తెలంగాణలో నేడు బిగ్‌డే..🗳️👥

తెలంగాణలో ఎన్నికల కాక మొదలైంది. నేటినుంచి ప్రధానపార్టీలు ఎన్నికల కదనరంగంలోకి దూకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతల సభలతో ఇవాళ తెలంగాణ మోతెక్కనుంది. హైదరాబాద్‌లో అమిత్‌, రేవంత్‌ సభలు నిర్వహిస్తుండగా.. కరీంనగర్‌లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. బూత్‌లెవల్‌ కార్యకర్తలతో LB స్టేడియంలో అమిత్‌షా మీటింగ్ నిర్వహించనుండగా.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో డ్వాక్రా సంఘాలతో సీఎం రేవంత్‌ సభ నిర్వహించనున్నారు. కరీంనగర్‌లో కేసీఆర్ కదనభేరి సభలో పాల్గొననున్నారు.మొత్తానికి నేటినుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలుకానుంది. 🗳️👥



 
 
bottom of page