top of page

చూడగానే అట్రాక్ట్‌ చేస్తున్న కొత్త ఫోన్‌..


ree

టెక్నో కెమాన్‌ 30ఎస్‌ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. విడుదల తేదీకి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రటకన చేయలేదు. అయితే వచ్చే నెలలో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్‌, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. తక్కువ ధరలోనే కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను తీసుకొస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. హీలియో జీ100 ఆక్టాకోరా ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. అలాగే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ స్క్రీన్‌ 1080*2436 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. వీటిలో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ IMX896 ప్రధాన సెన్సార్ OISతో పాటు, 2 ఎంపీతో కూడిన మరో కెమెాను అందించనున్నారు అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్సతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 45 నిమిషాల్లో ఫోన్‌ బ్యాటరీ ఫుల్‌ అవుతుందని కంపెనీ చెబతోంది. అలాగే ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లను అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఐపీ53 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇచ్చారు. ధరకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్‌ మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 
 
bottom of page