సెయింట్ విసెంటే స్టేడియంలో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు
- MediaFx

- Jun 25, 2024
- 1 min read
Updated: Jun 26, 2024
వెస్టిండీస్లోని సెయింట్ విసెంటే స్టేడియంలో రషీద్ ఖాన్ సారథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆఫ్ఘనిస్థాన్ విజయంతో సెమీఫైనల్కు చేరుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలకు తెరపడింది. తక్కువ రన్ రేట్ కారణంగా కంగారూ జట్టు ప్రపంచకప్నకు దూరమైంది. టాస్ గెలిచిన రషీద్ ఖాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెహ్మానుల్లా గుర్ప్బాజ్ 43 పరుగుల ఇన్నింగ్స్తో ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ జట్టు 105 పరుగులకే ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్ 18వ ఓవర్లో వరుసగా 2 వికెట్లు తీసి జట్టును ఆలౌట్ చేశాడు. 54 పరుగులు చేసిన లిటన్ దాస్ ఒక ఎండ్లో నిలవగా, మరో ఎండ్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. దీంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.











































