top of page

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్🌟


ఏపీ ఎన్నికలు అయిపోయాయి మరి పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో ఎపుడు  అడుగు పెడతారు..? ఒప్పుకున్న ఓజితో పాటు.. మొన్న చెప్పినట్లు హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది రాబోతుందా..? అసలు పవన్ ప్లాన్ ఏంటి..?   ఇపుడు  తెలుసుకుందాం.  

కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఈయన తీరు చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్‌కు వస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే జూన్ 4న ఫలితాల తర్వాత పవన్ కూడా షూటింగ్‌కు వస్తారని బలంగానే నమ్ముతున్నారు అభిమానులు. కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఫలితమేదైనా.. ఆగస్ట్‌లోనే పవన్‌కు సెట్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పాలిటిక్స్ పక్కనబెడితే.. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ఓజి షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది.. అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తైంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల షూట్ మాత్రమే జరిగింది. వీటిలో ఓజి, హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతున్నాయి. వీటి మొదటి భాగాలు 2024లోనే విడుదల కానున్నాయి. 

పవన్ ఎప్పుడు షూటింగ్‌కి వచ్చినా ముందు ఓజి అయితే పూర్తి చేస్తారు. కేవలం రెండు వారాల డేట్స్ ఇస్తే చాలు.. ఓజి ఓ కొలిక్కి వచ్చేస్తుంది. 2024లోనే ఈ చిత్రం వస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. కానీ హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ కూడా ఇదే ఏడాది వస్తుందని తెలిపారు నిర్మాత ఏఎం రత్నం. పైగా ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లోంచి జ్యోతికృష్ణ చేతుల్లోకి మారింది. 

ఓజితో పాటు వీరమల్లును కూడా 2024లోనే రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఎన్నికల్లో పవన్ గెలిస్తే మరింత బాధ్యతలు పెరుగుతాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఈ సినిమాలు పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 2025లోనే వస్తుందేమో..? టైమ్ దొరక్కపోతే ఇంకా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలిక.. పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో.. 

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page