top of page

ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటారు.. కేటీఆర్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మం లోని లకారం ట్యాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఖమ్మం లోని లకారం ట్యాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశం లో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం గా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్క రించే అవకాశం రావడం నా అదృష్టం . నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. తారక రామారావు పేరులోనే పవర్ ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. దక్షిణ భారత దేశం లో అన్న ఎన్టీఆర్ సహా ఇప్పటివరకు హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదు. అది సీఎం కేసీఆర్కు త్వరలో సాధ్యమవుతుంది’’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page