top of page

🇮🇳 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట..

🇮🇳 దేశ రాజధాని ఢిల్లీ స్వాతంత్య వేడుకలకు ముస్తాబవుతోంది. రేపు ఆగస్టు 15వ తేదీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకలకు ఈసారి 1800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. 🌍 వీరిలో కూలీలు, మత్స్యకారులు, సర్పంచ్, నర్సింలు, ఉపాధ్యాయులు ఉన్నారు. 💪

కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. 💼 కార్మికులు తమ భార్య లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 👨‍👩‍👧‍👦🌙 అదే సమయంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ పథకంతో సంబంధం ఉన్న రైతులు కూడా వేడుకలో పాల్గొంటారు. 🌾 👥 ఈ ప్రత్యేక అతిథులు 660 కంటే ఎక్కువ వైబ్రెంట్ గ్రామాలకు చెందిన 400 మందికి పైగా సర్పంచ్‌లు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్‌తో అనుబంధించబడిన 250 మంది రైతులు, కొత్త పార్లమెంటు భవనంతో సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తో అనుబంధించబడిన 50 మంది కార్మికులు ఉంటారు. 💼 అంతేకాదు ఖాదీ కార్మికులు, సరిహద్దు రహదారుల నిర్మాణం, అమృత సరోవర్, హర్ ఘర్ జల్ యోజన, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా పాల్గొంటారు. 🌈

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page