ఢిల్లీలో మోసపోయిన విదేశీ అమ్మాయిలు..
- MediaFx

- Aug 5, 2024
- 1 min read
తాజాగా ఢిల్లీకి చెందిన ఓ రిక్షా కార్మికుడు విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిలను మోసం చేసిన ఉదంతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన జామా మసీదు నుంచి ఎర్రకోటకు ప్రయాణానికి సంబంధించినది. ఈ ఘటనను విదేశీ యువతులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఈ వీడియోను సింగపూర్ ట్రావెల్ వ్లాగర్ సిల్వియా చాన్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలో ప్రయాణిస్తున్న తనను రిక్షా పుల్లర్ ఎలా మోసం చేశాడో తన వీడియోలో చెప్పింది. రిక్షా పుల్లర్ తమని జామా మసీదు నుంచి ఎర్రకోటకు తీసుకుని వెళ్ళడానికి 100 రూపాయలు తీసుకుంటానని చెప్పాడు. తాము ఆ రిక్షాలో ఎక్కి ఎర్రకోటకు వచ్చిన అనంతరం మాట మార్చి 6000 రూపాయలు డిమాండ్ చేయడం ప్రారంభించినట్లు వెల్లడించారు ఆ యువతులు.
ఇష్టం లేకపోయినా రిక్షా పుల్లర్కు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని సిల్వియా చెప్పింది. అంతేకాదు ఎవరైనా సరే ఇలాంటి మోసానికి గురి కాకుండా ఉండాలంటే.. ఉబెర్ వంటి సేవలను తీసుకోవాలని.. వాటికి ప్రాధాన్యత ఇవ్వడం సురక్షితమని ఆమె పేర్కొంది.












































