top of page

📅 ఆగస్ట్ 31న ప్రతిపక్ష పార్టీల మూడో మీటింగ్.. ముంబైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు.. 🗓️😊

ప్రతిపక్ష పార్టీల (INDIA) తదుపరి, మూడవ సమావేశం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు ముంబైలో జరగనుంది. ఈ మేరకు శుక్రవారం వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ముందుగా ఈ సమావేశం ఆగస్టు 25-26 తేదీల్లో జరగాల్సి ఉండగా, కొందరు నేతల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ముంబైలోని పోవై ప్రాంతంలోని హోటల్‌లో ఈ సమావేశం జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’ సమావేశంలో, సమన్వయకర్తపై నిర్ణయం తీసుకోవచ్చు. దీనితో పాటు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 👥🤝

దీంతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలపై కూడా చర్చించవచ్చని.. అలాగే కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరుగుతుందని ప్రతిపక్ష కూటమి సీనియర్ నేత ఒకరు తెలిపారు. 🏛️🗣️🤝🕖 🎉🎊🎈 బెంగళూరు సమావేశంలో పాల్గొన్న నేతలు..🏛️🗣️ 🤝🕖కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.🎉🎊🎈

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page