top of page

ఎన్నికల్లో మూడోసారి ఓటమి కావడంతో కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం ప్రారంభించింది!

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడోసారి ఓడిపోయింది. అధికారం దక్కకపోవడానికి కారణాలు అన్వేషించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో తక్కువ సీట్లు రావడం ప్రధాన కారణంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్ యాత్రలతో దేశం మొత్తం తిరిగినా, అనుకున్న ఫలితం రాలేదు. కాంగ్రెస్ సీట్ల సంఖ్య 52 నుండి 99 కి పెరిగినప్పటికీ, అధికారం దక్కలేదు. కాంగ్రెస్ అధిష్టానం 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తోంది, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లోని ప్రదర్శన పై దృష్టి సారిస్తోంది.

తెలంగాణలో 17 లో 8 సీట్లు మాత్రమే గెలిచారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నా, 11 సీట్లు మాత్రమే గెలిచారు, BJP మరియు JDS కలిపి 19 సీట్లు సాధించాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఒక సీటు కూడా గెలవలేకపోయారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అనుకున్న సీట్లు గెలిచినట్టు ఉంటే, కాంగ్రెస్ మెజారిటీ సాధించేదని అంచనా వేస్తున్నారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page