top of page

లద్దాఖ్‌ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా..


భారత సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా, తాజాగా తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సుపై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడీ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీనిని నిర్మించింది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో 1958 నుంచి చైనా అధీనంలో ఉన్న భూభాగంలో ఈ సరస్సు ఉంది. ఈ శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర భాగంలో నాలుగు నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో ఖుర్నాక్ కోట ఉంది. 1958 నుంచి ఇది చైనా అధీనంలో ఉంది. అంతకుముందు భారత్-చైనా మధ్య సరిహద్దు వద్ద ఖుర్నాక్ కోట ఉండేది. ఆ తర్వాత చైనా దానిని ఆక్రమించుకుంది. ఉపగ్రహ చిత్రాల్లో ఖుర్నాక్ కోటలో రెండు హెలిప్యాడ్‌లు కనిపిస్తున్నాయి. 1962 యుద్ధంలో లడఖ్‌లో కార్యకలాపాల కోసం చైనా ఈ ఖుర్నాక్ కోటను ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంది. మరో ఉపగ్రహ చిత్రం ఫిరంగి సైట్‌ను చూపుతోంది. అంతేకాదు, చైనీయులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానిస్తూ కందకాలను చైనా నిర్మించింది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page