top of page

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అమృతా ప్రణయ్!


సినిమాల్లోకి ఎంట్రీ!

అమృతా ప్రణయ్ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హౌజ్ లోకి వచ్చేందుకు ఆమె కూడా ఆసక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఇందులో ఎంత నిజముందో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తే తెలియదు. కాగా ఆ మధ్యన కార్తికేయ బెదురులంక 2012 మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది అమృతా ప్రణయ్. హీరో కార్తికేయతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. దీంతో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందనుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. భర్తను చంపిన తండ్రి మీద కేసు..

కాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న జరిగిన ప్రణయ్ హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమృత తండ్రి వ్యాపారవేత్త మారుతీ రావు ఓ కిల్లర్ కి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారు. తన భర్తను హత్య చేయించాడని మారుతీ రావు కూతురు అమృత తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ లో మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు పాల్పపడ్డారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page