ACCIDENT అల్వాల్లో యువతి కొత్త కారుతో బీభత్సం సృష్టించింది..!
- mahesh

- May 4, 2023
- 1 min read

సికింద్రాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు గాయపడిన వారిలో ఒకరితో కలిసి మోటార్సైకిల్పై వెళుతున్నారు. గాయపడిన మరో బాధితుడు కారులో ఉన్నాడు. ముగ్గురినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కాని దురదృష్టవశాత్తు, వారిలో ఒకరు మరణించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.
కానాజి గూడకు చెందిన శివాని అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నది. బుధవారం రాత్రి తన కొత్త కారుతో బయటకు వెళ్లిన ఆమె.. తిరుమలగిరి నుంచి మిలిటరీ డెయిరి ఫారం వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో అదుపుతప్పిన కారు.. ఓ వ్యక్తిని ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి, టిఫిన్ సెంటర్కు కగిలి.. కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆగింది. అయితే అక్కడే ఆగి ఉన్న ఓ స్కిగ్గీ బాయ్కు కారు తగలడంతో అతడు చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.



Comments